ex jd laxminarayana: నాడు మా అబ్బాయి సివిల్స్ రాశాడని మాకు తెలియదు!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తల్లి వసుంధర

  • లక్ష్మీనారాయణ ప్రొఫెసర్ అవుతాడనుకున్నాం
  • సివిల్స్ రాసిన విషయం మాకు తెలియదు
  • ఈ రిజల్ట్స్ ను పేపర్ లో చూసి వాళ్ల నాన్న చెబితే తెలిసింది

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురించి ఆయన తల్లి వసుంధర ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘అప్పుడు, లక్ష్మీనారాయణ ఎంటెక్ చదువుతున్నాడు. ఆ తర్వాత పీహెచ్ డీ పూర్తి చేసి ప్రొఫెసర్ అవుతాడని అనుకున్నాం. కానీ, సివిల్స్ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చే వరకు లక్ష్మీనారాయణ సివిల్స్ రాసిన విషయం మాకు తెలియదు. ఈ రిజల్ట్స్ ను పేపర్ లో చూసిన వాళ్ల నాన్న ఆ విషయం చెప్పడంతో అసలు సంగతి తెలిసింది. ఈ విషయం తెలిసి మేమంతా ఆశ్చర్యపోయాం. ఆ తర్వాత లక్ష్మీనారాయణ మాకు చెప్పాడు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

More Telugu News