Bihar: కుమారుడి పెళ్లిలో స్టెప్పులేసిన రబ్రీదేవి... వీడియో వైరల్!

  • పట్నాలో తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల వివాహం
  • ఆనందంతో నాట్యం చేసిన రబ్రీదేవి
  • వైరల్ అవుతున్న వీడియోలు

తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యల వివాహం గత రాత్రి పట్నాలో వైభవంగా జరుగగా, రబ్రీదేవి ఆనందంగా నృత్యాలు చేశారు. మూడు రోజుల పెరోల్ పై ఈ వివాహానికి లాలూ ప్రసాద్ యాదవ్ హాజరైన సంగతి తెలిసిందే. ఇక వివాహ వేడుకల్లో భాగంగా ఓ భోజ్ పురి పాటకు రబ్రీదేవితో పాటు మీసా భారతి, తేజస్వీ యాదవ్ లు, నవ దంపతులు నృత్యాలు చేయగా, ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వివాహం కోసం ప్రత్యేకంగా సాంగ్స్ కంపోజ్ చేయించగా, వాటికి కూడా అందరూ డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News