Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఈ నెల 25న వస్తున్న 'నా నువ్వే'  
  • 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ పనులు షురూ 
  • నాగశౌర్య దర్శకత్వంలో షార్ట్ ఫిలిం

*  నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న 'నా నువ్వే' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేస్తారు. ఈ చిత్రం రన్ టైం ఒక గంట 58 నిమిషాలు వుంటుంది.  
*  విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ ను తీసుకువచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ పనులు మొదలయ్యాయి.  
*  యువ కథానాయకుడు నాగ శౌర్య దర్శకుడిగా మారాడు. తాజాగా ఓ షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించాడు. 'భూమి' అనే పేరుతో రూపొందిన ఈ లఘు చిత్రాన్ని మాతృ దినోత్సవం సందర్భంగా ఈ రోజు విడుదల చేస్తున్నారు. 

More Telugu News