Pakistan: 26/11 ముంబై దాడులు చేసింది పాక్‌ ఉగ్రవాదులే!: నవాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు

  • ఇన్నాళ్లూ తమ దేశానికి సంబంధం లేదంటోన్న పాక్‌
  • 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి పాక్‌ కు చెందిన వాడేనన్న షరీష్
  • ఆ పేలుళ్లతో సర్కారుకి మాత్రం సంబంధం లేదని వ్యాఖ్య

26/11 ముంబై పేలుళ్లకు పాల్పడింది తమ దేశంలోని ఉగ్రవాదులేనని ‘డాన్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ పేలుళ్లతో తమ దేశ సర్కారుకి మాత్రం సంబంధం లేదని అన్నారు. ఆ పేలుళ్ల సూత్రధారి తమ దేశానికి చెందిన వ్యక్తేనని నవాజ్ షరీఫ్‌ అన్నారు. తమ దేశంలో క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర స్థావరాలు రాజ్యేతర శక్తులని చెప్పారు.

కాగా, 26/11 ముంబైలో జరిగిన ఆ మారణహోమంలో 9 మంది ఉగ్రవాదులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత భద్రతా దళాలకు చిక్కిన ఉగ్రవాది కసబ్‌కు ఉరి శిక్ష కూడా విధించారు. మరోవైపు పాకిస్థాన్‌ మాత్రం ఆ దాడులతో తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొస్తోంది. 

More Telugu News