chiranjeevi: 'మహానటి'లో సావిత్రి మద్యం తాగే సీన్ పై చిరంజీవి ప్రశ్న.. దర్శకుడి జవాబు!

  • 'మహానటి'తో సక్సెస్ అందుకున్న నాగ్ అశ్విన్ 
  • చిరంజీవి చేతులమీదుగా సత్కారం 
  • ఆయన సందేహాలకు సమాధానాలు

సావిత్రి జీవితచరిత్రగా రూపొందిన 'మహానటి' సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా దర్శక నిర్మాతలను చిరంజీవి ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ తో చిరంజీవి మాట్లాడుతూ .. " ఈ జనరేషన్ కి సావిత్రి గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీయడం అభినందించదగిన విషయం .. ఇదొక అద్భుతమైన ప్రయోగమనే చెప్పాలి"

"అయితే సావిత్రికి గల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆమె మద్యం తాగే విషయాన్ని ప్రేక్షకులకు చెప్పే విషయంలో ఆమె కూతురు చాముండేశ్వరి గారు అభ్యంతరం చెప్పలేదా"? అని అడిగారు. అందుకు నాగ్ అశ్విన్ స్పందిస్తూ .. " ఆ విషయంలో చాముండేశ్వరి గారు ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదు. నిజంగానే అలా జరిగింది కనుక .. చెప్పమని అన్నారు. అయితే ఆ విషయాన్ని హైలైట్ చేయకుండా .. ఆమె బయోపిక్ ఓ సెలబ్రేషన్ లా మిగిలిపోవాలనే ఉద్దేశంతోనే తీశాను" అంటూ ఆయన సమాధానమిచ్చారు. 

More Telugu News