dachepalli: దాచేపల్లిలో మరో దారుణం.. బాలికపై ఎంపీటీసీ భర్త అత్యాచారం!

  • పదమూడేళ్ల బాలికపై ఎంపీటీసీ భర్త మాబూవలీ అత్యాచారం
  • ఈ విషయం బయటపెడితే చంపుతానంటూ బెదిరింపులు
  • స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • బాలిక మూడు నెలల గర్భవతిగా తేల్చిన వైద్యులు

గుంటూరు జిల్లా దాచేపల్లిలో ముస్లిం బాలికపై అత్యాచార ఘటన మరవక ముందే మరో దారుణం అదే గ్రామంలో చోటు చేసుకుంది. దాచేపల్లిలోని పదమూడేళ్ల బాలికపై ఎంపీటీసీ భర్త మాబూవలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపెడితే చంపుతానంటూ చిన్నారిని బెదిరించాడు. దీంతో, భయపడిపోయిన ఆ చిన్నారి ఈ విషయం బయటపెట్టలేదు.

ఎట్టకేలకు, స్థానికుల సహకారంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు సదరు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతిగా నిర్ధారించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News