chiranjeevi: చిరంజీవి కోసం జానపద కథ .. దర్శకుడిగా నాగ్ అశ్విన్!

  • 'మహానటి'తో మార్కులు కొట్టేసిన నాగ్ అశ్విన్ 
  • చిరంజీవి నుంచి అభినందనలు 
  • ఆయనతో సినిమా చేసే ఛాన్స్  

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తో చిరంజీవికి ఎంతో అనుబంధం వుంది. ఆ కారణంగానే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన 'మహానటి' సినిమా ప్రమోషన్స్ లోను చిరంజీవి భాగమయ్యారు. ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో, దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తాను ఒక సినిమా చేయనున్నట్టు చిరంజీవి చెప్పారు.

చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పగా .. ఈ సినిమా వైజయంతీ బ్యానర్లో వుంటుందనే విషయాన్ని అశ్వనీదత్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో నాగ్ అశ్విన్ చేయనున్నది జానపద కథ అని తెలుస్తోంది. ఈ సినిమాకి 'భైరవ' అనే టైటిల్ ను అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? ఎవరెవరు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నారు? వంటి విషయాల్లో త్వరలోనే స్పష్టత రానుంది.   

More Telugu News