Karnataka: కర్ణాటక యువత! మీ ఓట్లతో ప్రజాస్వామ్య పండగను సుసంపన్నం చేయండి: ప్రధాని మోదీ విజ్ఞప్తి

  • కర్ణాటక సోదరసోదరీమణులకు నాదో విజ్ఞప్తి
  • అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి
  • ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతోంది. ఈ సందర్భంగా కర్ణాటక ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ‘కర్ణాటక సోదరసోదరీమణులకు నాదో విజ్ఞప్తి .. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. ముఖ్యంగా యువతకు చెబుతున్నా.. ప్రజాస్వామ్య పండగలో పాల్గొని మీ ఓట్లు వేయడం ద్వారా ఈ పండగను సుసంపన్నం చేయండి’ అని కోరారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఓ ప్రకటన చేశారు. కర్ణాటక ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని, ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ స్నేహితులకు సాదర స్వాగతమని అన్నారు.

More Telugu News