jodhpur: జోథ్ పూర్ లో సల్మాన్ ఖాన్..మరింత భద్రత కల్పించిన రాజస్థాన్ పోలీస్!

  • ‘రేస్ 3’ సినిమా షూటింగ్ నిమిత్తం జోథ్ పూర్ వెళ్లిన సల్మాన్
  • కృష్ణ జింకలను వేటాడిన సల్మాన్ కు గతంలో బెదిరింపులు
  • ఈ నేపథ్యంలో మరింత భద్రత కల్పించిన రాజస్థాన్ పోలీస్

కృష్ణ జింకలను వేటాడిన కేసులో జైలుశిక్ష పడ్డ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు  రాజస్థాన్ లోని జోథ్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ కేసు విచారణ నిమిత్తం జోథ్ పూర్ కు పలుమార్లు సల్మాన్ వెళ్లాడు. అయితే, సల్మాన్ మరోసారి జోథ్ పూర్ కు వెళ్లాల్సి వచ్చింది. తన కేసు విషయమై కాకుండా తాను నటిస్తున్న ‘రేస్ 3’ సినిమా చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్లాడు.

సల్మాన్ కు రాజస్థాన్ పోలీసులు మరింత భద్రత కల్పించారు. ఎందుకంటే, కృష్ణ జింకలను వేటాడిన సల్మాన్ ని చంపేస్తామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గతంలో హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ పై బిష్ణోయ్ తెగకు చెందిన వారు దాడికి పాల్పడే అవకాశముందనే అనుమానంతో రాజస్థాన్ పోలీసులు మరింత భద్రత కల్పించారు.
 

More Telugu News