Tollywood: ఈ సినిమాను మనసు పెట్టి కాకుండా మైండు పెట్టి తీశాను: రామ్ గోపాల్‌ వర్మ

  • ఈ రెండింటికీ తేడా ఏంటో సినిమా చూస్తే తెలుస్తుంది
  • చాలా కాలం తరువాత మంచి కథ రాశాం
  • ప్రేక్షకులు కొత్త అనుభవాన్ని పొందుతారు

చాలా కాలం తరువాత మంచి కథ రాశామని, దాన్ని అక్కినేని నాగార్జునకు చెప్పామని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. 'ఆఫీసర్‌' సినిమాను మనసు పెట్టికాదు, మైండ్‌ పెట్టి తీశానని, ఈ రెండింటికీ తేడా ఏంటో సినిమా చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ సినిమా చూస్తోన్న ప్రేక్షకులు కొత్త అనుభవాన్ని పొందుతారని అన్నారు. రేపు ఈ సినిమా ట్రైలర్‌ వచ్చేస్తోందని, దయచేసి దాన్ని చూడాలని నాగార్జునతో కలిసి తీసిన ఓ వీడియోలో చెప్పారు. కాగా, ఈ సినిమా స్టోరీ తనకు బాగా నచ్చిందని, తాను నమ్మిన దాని కోసం పోరాడే ఆఫీసర్‌గా నటించానని నాగార్జున ఇదే వీడియోలో తెలిపారు.                                               

More Telugu News