apple watch series 3: యాపిల్ అభిమానులకు తీపి కబురు... నేటి నుంచే యాపిల్ వాచ్ సిరీస్ 3 ఎల్టీఈ విక్రయాలు

  • 38ఎంఎం, 42ఎంఎం వేరియంట్లలో లభ్యం
  • ధరలు రూ.39,080 నుంచి రూ.41,120 మధ్య
  • రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ద్వారా విక్రయాలు

యాపిల్ వాచ్ సిరీస్ 3 ఎల్టీఈ విక్రయాలు నేటి నుంచి మొదలవుతున్నాయి. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో యాపిల్ స్మార్ట్ వాచ్ లను ఉచిత సిమ్ కార్డుతో స్వయంగా విక్రయాలు నిర్వహించనున్నాయి. యాపిల్ సిరీస్ 3 వాచ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 38ఎంఎం ప్రారంభ ధర రూ.39,080. 42ఎంఎం ధర రూ.41,120. వీటిని జియో డాట్ కామ్, ఎయిర్ టెల్ డాట్ ఇన్ వెబ్ సైట్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. వొడాఫోన్, ఐడియా విక్రయించడం లేదు.

యాపిల్ సిరీస్ 3 స్మార్ట్ వాచ్ కు ఎల్టీఈ సపోర్ట్ ఉంటుంది. దీంతో వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎస్ఎంఎస్ లు పంపుకోవడం, స్వీకరించడం చేయవచ్చు. ‘విచాట్’ తరహా థర్డ్ పార్టీ యాప్స్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. యాపిల్ మ్యూజిక్ స్టేషన్ ఇతర ప్లాట్ ఫామ్ లకు కనెక్ట్ అయి లక్షలాది పాటలను వినే అవకాశం ఉంది. 18 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. గోల్డ్, అల్యూమినియం, సిల్వర్, స్పేస్ గ్రే కలర్స్ లో వాచ్ లు అందుబాటులో ఉంటాయి.

More Telugu News