nani: 'ఎవడే సుబ్రమణ్యం'కు సీక్వెల్ ప్రయత్నాలు

  • నాని హీరోగా వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం'
  • ఈ సినిమాతో ఆయనకి హిట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
  • ఇద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేసే ఛాన్స్  

నాని వరుస విజయాలు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతోనే మొదలయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత నాని చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయాడు. నాగ్ అశ్విన్ మాత్రం చాలా గ్యాప్ తీసుకుని 'మహానటి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది.

 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచి కొత్త కథను అల్లుకుని సీక్వెల్ చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. నాని హీరోగానే ఆయన ఈ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టే పనిలో వున్నాడని అంటున్నారు. తాను ఇబ్బందుల్లో వున్నప్పుడు నాగ్ అశ్విన్ మంచి హిట్ ఇచ్చినందువలన, ఈ సినిమా చేయడానికి నాని తప్పకుండా ఒప్పుకుంటాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్పష్టమైన సమాచారం త్వరలోనే రావొచ్చు.   

More Telugu News