ajith: హైదరాబాద్ లో 'విశ్వాసం' .. అజిత్ ద్విపాత్రాభినయం!

  • అజిత్ హీరోగా 'విశ్వాసం'
  • కథానాయికగా నయనతార 
  • ఈ ఏడాది చివరిలో విడుదల     

కోలీవుడ్ అగ్రకథానాయకులలో అజిత్ ఒకరు. కోలీవుడ్ హాండ్సమ్ హీరోగా అజిత్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా 'విశ్వాసం' రూపొందుతోంది. శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది.

తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. గతంలో శివ .. అజిత్ కాంబినేషన్లో వచ్చిన 'వీరమ్' .. 'వేదాళం' .. 'వివేగం' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక 'విశ్వాసం' కూడా ఆ రేంజ్ హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.  

More Telugu News