sharwanand: మల్టీస్టారర్ నుంచి శర్వానంద్ తప్పుకునే ఛాన్స్!

  • మల్టీ స్టారర్ గా 'దాగుడుమూతలు'
  • దర్శకుడిగా హరీశ్ శంకర్ 
  • ఒక హీరోగా నితిన్  

ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా హను రాఘవపూడితోను .. మరో సినిమాను సుధీర్ వర్మతోను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలు కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేసుకున్నాయి. ఈ సినిమా తరువాత శర్వానంద్ .. హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు.

హరీశ్ శంకర్ 'దాగుడుమూతలు' అనే మల్టీ స్టారర్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఒక హీరోగా నితిన్ ను .. మరో హీరోగా శర్వానంద్ ను తీసుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి శర్వానంద్ తప్పుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. కారణాలేమిటనేది తెలియదుగానీ, హరీశ్ శంకర్ సినిమా నుంచి శర్వానంద్ తప్పుకోనున్నాడని అంటున్నారు. అదే నిజమైతే మరో హీరోగా ఎవరిని తీసుకుంటారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా కోసం కథానాయికలను కూడా ఎంపిక చేయనున్నారు.  

More Telugu News