Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • బయోపిక్స్ లో చేస్తానంటున్న తమన్నా 
  • నిజజీవిత పాత్రలో సాయిపల్లవి 
  • దుబాయ్ లో మణిరత్నం 'నవాబ్'

*  బయోపిక్స్ లలో నటించడం అంటే తనకూ ఇష్టమేనని చెబుతోంది కథానాయిక తమన్నా. శ్రీదేవి, సానియా మీర్జా జీవితకథలతో రూపొందించే చిత్రాలలో నటించాలని వుందని తమ్మూ చెప్పింది. అలాంటి చిత్రాలలో నటించే అవకాశం వస్తే కనుక వదులుకోనని తెలిపింది.
*  అందాలభామ సాయి పల్లవి తన నిజ జీవిత పాత్రను ఓ సినిమాలో పోషిస్తోంది. నిజజీవితంలో ఎంబీబీఎస్ చదివిన ఈ చిన్నది ఇప్పుడు 'పడిపడి లేచె మనసు' సినిమాలో ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయిగా నటిస్తోంది. ఇది తనకెంతో ఆనందాన్నిస్తోందని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన సినిమాల షూటింగులను అరుదుగా విదేశాలలో చేస్తుంటారు. కథ ప్రకారం తప్పనిసరి అయితేనే విదేశాలకు వెళతారు. ఈ క్రమంలో  తన తాజా చిత్రం 'నవాబ్' షూటింగ్ కోసం ఆయన దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.      

More Telugu News