Karnataka: కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం

  • ఈరోజు సాయంత్రంతో ముగిసిన ఎన్నికల ప్రచారం
  • ఈ నెల 12న 223 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు
  • 15న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. ప్రధాన రాజకీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నాయి. గెలుపుపై ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేశాయి.

కాగా, ఈ నెల 12న కర్ణాటకలోని 223 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఇదిలా ఉండగా, కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలుండగా, బీజేపీ అభ్యర్థి విజయకుమార్ ఆకస్మిక మరణంతో జయనగర నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడింది.

More Telugu News