smartphone: ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: ఈ ఫోన్ కొంటే రూ.2వేల వరకు క్యాష్‌బ్యాక్‌!

  • కార్బన్ సంస్థ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్ 'ఫ్రేమ్స్ ఎస్9' విడుదల
  • ఈ  స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.6,790
  • 36 నెలల పాటు రూ.169 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి

కార్బన్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఫ్రేమ్స్ ఎస్9' ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.6,790 గా ఉంది. అయితే ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.169 ప్లాన్‌ను 36 నెలల పాటు రీచార్జి చేసుకుంటే వారు రూ.2వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు.

స్పెసిఫికేషన్స్ :

  • 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు
  • ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టం
  • 5.2" హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
  • 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( 64జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
  • 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • 2900 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్

More Telugu News