sumanth: అతీంద్రియ శక్తుల నేపథ్యంలో 'సుబ్రహ్మణ్యపురం'

  • షూటింగు దశలో 'సుబ్రహ్మణ్య పురం'
  • కథానాయకుడిగా సుమంత్
  • ఆయన సరసన ఈషా రెబ్బా

ఈ మధ్య కాలంలో అతీంద్రియ శక్తుల నేపథ్యంతో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కరెక్టుగా కంటెంట్ ను ప్రెజెంట్ చేయగలిగితే ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తోన్న సుమంత్, ఈ సారి అతీంద్రియ శక్తులకు సంబంధించిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కథకి తగినట్టుగా ఈ సినిమాకి 'సుబ్రహ్మణ్యపురం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.  పోస్టర్ చూస్తుంటే ఇది సుబ్రహ్మణ్యస్వామి మహిమాన్విత ఆలయం చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ నెల 12వ తేదీ నాటికి ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా సుమంత్ కి తప్పకుండా సక్సెస్ ను అందించే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    

More Telugu News