samsung j series: మార్కెట్ ను కొల్లగొట్టేందుకు శామ్ సంగ్ సన్నద్దం... తక్కువ ధరలకే ఇన్ఫినిటీ డిస్ ప్లే ఫోన్లు

  • మిడ్ సెగ్మెంట్లో జే సిరీస్ ఫోన్లు త్వరలో
  • ఇన్ఫినిటీ డిస్ ప్లే తో ఉండనున్న ఫోన్లు

చైనా ఫోన్ల హవాతో వెనుకబడిన శామ్ సంగ్ భారత మొబైల్స్ మార్కెట్ ను తిరిగి తన వైపునకు తిప్పుకునే ప్రణాళికతో సిద్ధమైంది. గెలాక్సీ జే సిరీస్ లో తక్కువ ధరలకే ఫోన్లను తీసుకొస్తోంది. ఇన్ఫినిటీ డిస్ ప్లేతో బెజెల్ లెస్ స్క్రీన్ తో ఇవి వుంటాయి. అందుబాటు ధరల్లోనే వీటిని తీసుకురానున్నట్టు పరిశ్రమ వర్గాల సమాచారం.

వీటిని నోయిడాలోని ప్లాంట్ లో తయారు చేయనుంది. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్8 సిరీస్ లో తొలిసారి ఇన్ఫినిటీ మొబైల్స్ ను 2017లో విడుదల చేసింది. ప్రస్తుతం జే7 డ్యుయోస్ రూ.16,990గా ఉంది. శామ్ సంగ్ కనుక ఇన్ఫినిటీ మొబైల్స్ ను బడ్జెట్ ధరలకే తీసుకొస్తే కుప్పలు తెప్పలుగా అమ్ముడుపోయే అవకాశం ఉంది.

More Telugu News