lalu prasad yadab: ఢిల్లీ కోర్టుకు హాజరైన లాలూ ప్రసాద్ కుమార్తె, అల్లుడు!

  • మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరైన మిసా భారతి, ఆమె భర్త
  • రూ. 8 వేల కోట్లకు సంబంధించిన కేసు
  • ఓ సీక్రెట్ కంపెనీ ద్వారా మనీ లాండరింగ్

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్ లను ఈరోజు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. రూ. 8 వేల కోట్ల మనీ లాండరింగ్ కు సంబంధించి వీరిద్దరిపై ఈడీ కేసు నమోదు చేసింది. సురేంద్ర జైన్, వీరేంద్ర జైన్ అనే ఇద్దరు వ్యాపారులకు చెందిన ఓ సీక్రెట్ కంపెనీ ద్వారా... మిసా భారతి, ఆమె భర్త నల్లధనాన్ని చలామణిలోకి తీసుకొస్తున్నట్టు అభియోగాలు మోపింది. ఆ ఇద్దరు వ్యాపారులను కూడా కోర్టులో ప్రవేశపెట్టగా గత జనవరిలో వారిద్దరికీ రూ. 2 లక్షల పూచీకత్తు మీద బెయిల్ లభించింది. మిసా భారతి దంపతులకు కూడా బెయిల్ ఇచ్చినప్పటికీ.... దేశాన్ని మాత్రం విడిచి వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. 

More Telugu News