sai dharam tej: పారిస్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సాయిధరమ్ తేజ్

  • కరుణాకరన్ తో సాయిధరమ్ తేజ్ 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    

యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను సాయిధరమ్ తేజ్ కి మంచి క్రేజ్ వుంది. అయితే కొంతకాలంగా ఆయనకి సక్సెస్ ముఖం చాటేస్తూ వస్తోంది. దాంతో ఆయన మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కథ కొత్తగా ఉందనే ఉద్దేశంతో ఆయన కరుణాకరన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. ఆయనతో కలిసి ' తేజ్ ఐ లవ్ యు'తో సెట్స్ పైకి వెళ్లడం జరిగిపోయాయి.

 కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను .. ఒక పాటను పారిస్ లో చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. పారిస్ లో చిత్రీకరించిన పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. 

More Telugu News