Samanta: ఈ సమస్యలేవీ నా జీవితంలో రాలేదు... దేవుడికి కృతజ్ఞతలు: సమంత

  • విశాల్ తో కలసి 'ఇరుంబుతిరై' చేసిన సమంత
  • ఇంటర్నెట్ సమస్యలను చర్చించిన చిత్రం
  • తనకు సైబర్ సమస్యలు ఎదురుకాలేదని వెల్లడి

సమంత నటించిన 'మహానటి' బుధవారం నాడు తెలుగులోను, శుక్రవారం నాడు తమిళంలోను విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అలాగే విశాల్ తో కలసి ఆమె నటించిన 'ఇరుంబుతిరై' కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ నిమిత్తం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, 'ఇరుంబుతిరై' కథ, ఇంటర్నెట్ ద్వారా వచ్చే సమస్యలపై చర్చిస్తుందని తెలిపింది.

ఈ కథను దర్శకుడు మిత్రన్ తనకు వినిపించినప్పుడు, మీడియా, నెట్ ద్వారా ఇన్ని సమస్యలు ఉంటాయా? అని అనిపించిందని, కథ విన్నాక తన ఫోన్ ను తాకాలంటేనే భయం వేసిందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో కనిపించే ప్రాబ్లమ్స్ తన జీవితంలో ఎన్నడూ రాలేదని, అందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని పేర్కొంది. తన స్నేహితులు కొందరికి ఇటువంటి సమస్యలే ఎదురయ్యాయని, సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగించుకోవాలన్న సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందని వ్యాఖ్యానించింది.

More Telugu News