East Godavari District: బాలికపై అత్యాచారయత్నం చేసిన పార్టీ నేతను సస్పెండ్ చేసిన టీడీపీ

  • కత్తిపూడి ఎంపీటీసీ భర్త శ్రీనివాస్ పై ఆరోపణలు
  • సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన విడుదల
  • శ్రీనివాస్ తీరును ఖండించిన పార్టీ

ఓ బాలికపై అత్యాచారానికి యత్నించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి తెలుగుదేశం పార్టీ నేత కె.శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్టు ప్రకటన వెలువడింది. కత్తిపూడి ఎంపీటీసీ సభ్యురాలి భర్త అయిన శ్రీనివాస్, ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేయాలని ప్రయత్నించినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

బాలిక పట్ల ఆయన వ్యవహరించిన తీరును ఖండిస్తూ, అతనిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ప్రకటించిన పార్టీ, అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు ఈ మేరకు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.

More Telugu News