Badrinath: 90 అడుగుల లోయలో పడకుండా బస్సును కాపాడిన చెట్టు... 22 మంది సేఫ్!

  • బద్రీనాథ్ కు బయలుదేరిన రాజస్థాన్ యాత్రికులు
  • మార్గమధ్యంలో ట్రక్కును ఢీకొన్న బస్సు
  • ఆపై లోయలోకి జారుతుండగా అడ్డుకున్న చెట్టు

22 మందితో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురై, అదుపుతప్పి లోయలోకి జరుగుతుండగా, ఓ భారీ వృక్షరాజం అడ్డుగా నిలిచి వారి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన గోచర్ సమీపంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ నుంచి ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ కు బయలుదేరిన బస్సు మార్గమధ్యంలో ఓ ట్రక్కును ఢీకొంది. ఆపై అదుపుతప్పి పక్కనే ఉన్న లోయవైపు దూసుకెళ్లి, ఓ చెట్టును ఢీకొని ఆగింది. బస్సులోని వారు స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ చెట్టే అడ్డుపడకుంటే, 90 అడుగుల లోయలోకి జారి తామందరి ప్రాణాలూ పోయేవని యాత్రికులు వ్యాఖ్యానించారు.

More Telugu News