keerthy: మాయాబజార్‌లో సావిత్రిలా అబ్బురపరుస్తోన్న కీర్తి సురేష్‌ లుక్‌

  • పోస్ట్ చేసిన కీర్తి సురేష్‌
  • సోషల్ మీడియాలో వైరల్
  • ఈ నెల 9న మహానటి విడుదల

అలనాటి నటీమణి సావిత్రి జీవితకథ ఆధారంగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మహానటి' సినిమా ఈ నెల 9న విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించి స్టిల్స్‌ విడుదల చేస్తూ సినిమాపై మరింత ఆసక్తి నెలకొల్పుతోంది. మాయాబజార్‌ సినిమాలో సావిత్రిలా నటిస్తుండగా తీసిన ఫొటోలను తాజాగా కీర్తి సురేష్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.
     అచ్చం సావిత్రిలా కనపడుతోన్న కీర్తి సురేష్‌ కి చెందిన ఈ లుక్‌ విపరీతంగా వైరల్ అవుతోంది. అప్పట్లో సావిత్రి లుక్‌ని, ఇప్పటి కీర్తి సురేష్‌లుక్‌ని పక్కపక్కకు పెట్టి నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని మరికొన్ని స్టిల్స్‌ కూడా అలరిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని 'మహానటి' యూనిట్‌ ఇప్పటివరకూ బయటపెట్టలేదు.        

More Telugu News