nagachaitanya: 'సవ్యసాచి' విడుదల వాయిదాపడే అవకాశం!

  • షూటింగు దశలో 'సవ్యసాచి'
  • చైతూ జోడీగా నిధి అగర్వాల్ 
  • కీలకమైన పాత్రలో భూమిక  

దర్శకుడిగా చందు మొండేటి సత్తాను చెప్పడానికి 'కార్తికేయ' .. 'ప్రేమమ్' సినిమాలు సరిపోతాయి. విభిన్నమైన కథలను ఆయన కొత్తకోణంలో తెరపై ఆవిష్కరిస్తాడనే విషయాన్ని ఈ రెండు సినిమాలు నిరూపించాయి. అలాంటి చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం చెప్పారు.

అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం తక్కువనే టాక్ తాజాగా వినిపిస్తోంది. కారణాలు తెలియదుగానీ, జులైలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారని అంటున్నారు. చందు .. చైతూ కాంబినేషన్లో 'ప్రేమమ్' తరువాత వస్తోన్న సినిమా కావడం ఆసక్తిని రేకెత్తించే విషయం. ఈ సినిమాలో చైతూ అక్క పాత్రలో భూమిక కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News