dachepalli: చెట్టుకు ఉరేసుకుని అత్యాచార నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య!

  • అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉరేసుకున్న సుబ్బయ్య
  • ఆత్మహత్యకు ముందు స్నేహితులకు ఫోన్  
  • మృతుడిని సుబ్బయ్యగా నిర్ధారించిన హోంమంత్రి చినరాజప్ప  

దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. గురజాల మండలంలోని దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడిని సుబ్బయ్యగా హోంమంత్రి చినరాజప్ప నిర్ధారించారు.

కాగా, ఆత్మహత్య చేసుకునే ముందు తన స్నేహితులకు సుబ్బయ్య ఫోన్ చేసినట్టు సమాచారం. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చినరాజప్ప హామీ ఇచ్చారు. సుబ్బయ్య ఎప్పుడు ఉరి వేసుకున్నాడనే విషయం వైద్యులు నిర్ధారిస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా, బాధితురాలి బంధువులు, స్నేహితులు మాట్లాడుతూ, నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు కనుక సరిపోయిందని, బతికి ఉన్నట్టయితే తమ చేతుల్లో చచ్చిపోయేవాడని అంటున్నారు.

More Telugu News