times of india: టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ టాప్ టెన్ లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు!

  • 50 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ ను విడుదల చేసిన టైమ్స్
  • తొలి స్థానాన్ని కైవసం చేసుకున్న రణ్ వీర్ సింగ్
  • విరాట్ కోహ్లీకి మూడో స్థానం

2017 సంవత్సరానికి గాను ప్రముఖ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా 'మోస్ట్ డిజైరబుల్' లిస్టును ప్రకటించింది. ఈ జాబితాలోని టాప్ టెన్ లో ఏకంగా ముగ్గురు టాలీవుడ్ హీరోలు స్థానం సంపాదించుకున్నారు. 'బాహుబలి'తో నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 6వ స్థానంలో మహేష్ బాబు, 7వ స్థానంలో రానా నిలిచారు. తొలి స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కైవసం చేసుకున్నాడు. 3,4,5 స్థానాల్లో వరుసగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రాలు నిలిచారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ 9వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

క్రేజ్, పాప్యులారిటీ ఆధారంగా 50 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ జాబితాను ప్రతి ఏటా టైమ్స్ విడుదల చేస్తుంటుంది. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ హీరోలకు సమానమైన ఫాలోయింగ్ ను యంగ్ రెబల్ స్టార్ సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ఇప్పుడు అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటోంది. 

More Telugu News