Virat Kohli: రక్తంతో రాసిన లేఖను కారులోకి విసిరాడు.. ఆ క్షణం భయపడ్డాను!: కోహ్లీ

  • ఇటీవల ఢిల్లీలో ఈ ఘటన జరిగింది
  • కారులో వెళుతున్నాను
  • ఓ లేఖ వచ్చి పడింది

తాను ఇటీవల ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రక్తంతో రాసిన లేఖను తనకు ఇచ్చాడని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. తాజాగా, ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ ఆ విషయం గురించి చెబుతూ... తాను కారులో వెళుతూ, కారు అద్దాలను దింపానని, వెంటనే ఒక కాగితం వచ్చి పడిందని అన్నాడు. దానిని ఎవరు విసిరారో కూడా తాను చూడలేదని అన్నాడు. రక్తంతో రాసి ఉన్న ఆ లేఖను తాను పూర్తిగా చూడలేదని, ఆ లేఖను రాసిన వ్యక్తి పేరు అందులో ఉందని, తనకు చాలా భయం వేసిందని చెప్పాడు.

వెంటనే దానిని సెక్యూరిటీ గార్డ్‌కు ఇచ్చేశానని కోహ్లీ అన్నాడు. అలాగే, ఓసారి తాను విమానంలో ప్రయాణిస్తుండగా జరిగిన ఓ అనుభవాన్ని కోహ్లీ చెప్పాడు. విమానంలో తాను నిద్రలో మునిగిపోగా, ఓ వ్యక్తి వచ్చి తనతో సెల్ఫీ దిగాడని అన్నాడు. 

More Telugu News