akash puri: యుఎస్ఏ లో 'మెహబూబా' భారీ రిలీజ్ .. ప్రమోషన్స్ లో హీరో .. హీరోయిన్స్

  • ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
  • కథానాయికగా నేహా శెట్టి 
  • ఈ నెల 11వ తేదీన భారీ రిలీజ్

పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమాను రూపొందించాడు. నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యుద్ధం నేపథ్యంలో కొనసాగే అందమైన ప్రేమకథగా ఈ సినిమాను పూరీ రూపొందించాడు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. ఓవర్సీస్ లోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

 ఓవర్సీస్ థియేట్రీకల్ రైట్స్ ను 'బ్లూ స్కై సినిమాస్' వారు దక్కించుకున్నారు. యుఎస్ఏ లో ఈ నెల 10వ తేదీన  ఈ సినిమా ప్రీమియర్ షోస్ ను ప్రదర్శించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ యుఎస్ఏ లో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ ను నిర్వహించనుంది. ఈ సినిమా దర్శక నిర్మాతగా తనకీ .. హీరోగా తన తనయుడికి ఘన విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో పూరీ వున్నాడు.    

More Telugu News