nithin: 'ఛలో' దర్శకుడితో నితిన్ .. కథానాయికగా మెహ్రీన్

  • నితిన్ హీరోగా సెట్స్ పై 'శ్రీనివాస కల్యాణం'
  • నెక్స్ట్ మూవీ వెంకీ కుడుములతో 
  • నితిన్ సొంత బ్యానర్లో నిర్మాణం  

తెలుగు తెరపై గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కథానాయికల్లో మెహ్రీన్ పేరు ముందుగా కనిపిస్తుంది. ఈ సుందరికి యూత్ లో విపరీతమైన క్రేజ్ వుంది. ప్రస్తుతం గోపీచంద్ తో 'పంతం' ..  వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కాంబినేషన్ లోని మల్టీ స్టారర్ .. విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రంగా రూపొందుతోన్న 'నోటా' సినిమాలోనూ నటిస్తోంది.

 తాజాగా నితిన్ జోడీగా చేసే ఛాన్స్ అమ్మడికి దక్కడం విశేషం. ప్రస్తుతం నితిన్ .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుములతో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారు. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. 'శ్రీనివాస కల్యాణం' షూటింగ్ పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు.    

More Telugu News