Siddaramaiah: పేపర్‌లో చూస్తూ 15 నిమిషాలైన మాట్లాడండి చూద్దాం: మోదీకి సిద్ధరామయ్య ప్రతి సవాల్‌

  • నిన్న రాహుల్‌ గాంధీకి మోదీ సవాల్‌
  • కాగితం చూడకుండా 15 నిమిషాలైనా మాట్లాడాలన్న మోదీ
  • ట్విట్టర్‌లో ప్రతి సవాల్‌ విసిరిన సిద్ధరామయ్య
  • గతంలో యడ్యూరప్ప సర్కారు సాధించినవేంటని ప్రశ్న

ప్రశంసలు, విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు అన్నీ ట్విట్టర్‌ వేదికగానే జరుగుతున్నాయి. నిన్న కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా సంతెమారహళ్లిలో బహిరంగసభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఓ సవాలు విసిరిన విషయం తెలిసిందే. 'హిందీ లేక ఆంగ్లం లేక మీ అమ్మగారి మాతృభాష ఇటాలియన్‌లో 15 నిమిషాలు కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాలను కాగితం చూడకుండా మాట్లాడండి' అని మోదీ సవాల్ విసిరారు.

దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ఈ రోజు ట్విట్టర్‌లో మోదీకి ప్రతి సవాలు విసిరారు. కర్ణాటకలో గతంలో యడ్యూరప్ప సర్కారు సాధించినవేంటో 15 నిమిషాలు పేపర్‌లో చూసుకుంటూ అయినా మాట్లాడాలని అన్నారు. 

More Telugu News