Hyderabad: హైదరాబాద్ సినిమా హాల్ లో అత్యాచారం చేసింది సిబ్బందే... రాజీయత్నాలు విఫలం!

  • విజేత థియేటరులో ఘటన
  • నీటి కోసం వెళితే అత్యాచారం
  • ఫోక్సో చట్టం కింద కేసు

ఎదురుగా ఉండే పూరి గుడిసెల్లో నివసించే బాలిక. నీళ్ల కోసం రోజూ ఆ సినిమా హాల్ కు వెళ్లి అక్కడున్న పంపులో పట్టి తెచ్చుకుంటుంది. రోజులానే వెళ్లిన ఆ అమ్మాయిపై సినిమా హాల్ లో స్వీపర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ కన్ను పడింది. నీళ్లు ఇస్తానంటూ పార్కింగ్ సెల్లార్ కు తీసుకెళ్లి, లైంగికదాడి చేయడంతో పాటు, నోట్లో గుడ్డలు కుక్కి బాత్ రూములో పడేసి వెళ్లాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్, బోరబండలో ఉన్న విజేత థియేటర్ లో జరిగింది.

బాలిక ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి థియేటరు మొత్తం వెతికి, ఆపై బాత్ రూములో చూడగా, అక్కడ స్పృహతప్పి పడివుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, కొందరు రాజకీయనాయకులు రంగంలోకి దిగి రాజీ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఈలోగా విషయం మీడియాకు పొక్కడంతో, అన్ని చానళ్లలో ఈ విషయం ప్రముఖంగా ప్రసారం కావడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టామని, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News