husband: మరొక వ్యక్తితో భార్య.. నిప్పంటించిన భర్త

  • గల్ఫ్ లో పని చేస్తున్న భర్త
  • ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తితో భార్య శారీరక సంబంధం
  • కిరోసిన్ పోసి భార్యకు నిప్పు పెట్టిన భర్త

తన భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో... ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడో భర్త. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కుందుకడవు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బిరాజ్ (39) అనే వ్యక్తి ఓ దుకాణంలో పని చేస్తూ జీతు అనే మహిళను పెళ్లాడాడు. ఆ తర్వాత గల్ఫ్ దేశానికి వెళ్లాడు.

ఈ నేపథ్యంలో, జీతుకు ఫేస్ బుక్ ద్వారా ఓ వక్తి పరిచయమయ్యాడు. క్రమంగా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన బిరాజ్... తన భార్యతో విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పరిస్థితుల్లో ఆయన భార్య జీతు పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, ఆమె మీద పట్టరాని కోపంతో ఉన్న బిరాజ్... ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన జీతును త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న బిరాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

More Telugu News