gali janardhan reddy: గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం షాక్?.. ఎన్నికల ప్రచారానికి దూరంగా మైనింగ్ కింగ్!

  • తన అనుచరులకు పెద్ద సంఖ్యలో టికెట్లు ఇప్పించుకున్న గాలి
  • గత నాలుగు రోజులుగా ప్రచారానికి దూరం
  • సిద్ధరామయ్యపై చేసిన తీవ్ర వ్యాఖ్యలే కారణం?

తన అనుచరులకు పెద్ద సంఖ్యలో బీజేపీ నుంచి టికెట్లు ఇప్పించుకున్న మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి... గత నాలుగు రోజులుగా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రచారానికి గాలి దూరంగా ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

బాదామి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై గాలి ప్రధాన అనుచరుడు శ్రీరాములు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, బాదామిలో సిద్ధ రావణ (సిద్ధరామయ్య)ను మా శ్రీరాముడు సంహరిస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. గాలి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మరోవైపు, బీజేపీలోని కొందరు నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలంటూ గాలిని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు చెప్పుకుంటున్నారు.

More Telugu News