rahul gandhi: ఎయిమ్స్ లో లాలూకు రాహుల్ గాంధీ పరామర్శ

  • పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ
  • చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరిక
  • ఆస్పత్రిలో కలిసి వివరాలు తెలుసుకున్న రాహుల్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను పరామర్శించారు. పలు రకాల సమస్యలతో చికిత్స కోసం లాలూ ప్రసాద్ యాదవ్ ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే. మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధులకు ఆయన వరుస చికిత్సలు తీసుకునేందుకు ఎయిమ్స్ లో చేరారు. దీంతో రాహుల్ గాంధీ నేరుగా ఎయిమ్స్ కు వెళ్లి లాలూను కలుసుకున్నారు. అయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూపీఏలో ఆర్జేడీ కూడా భాగస్వామ్య పక్షం అనే విషయం తెలిసిందే.

More Telugu News