OPPO: అమేజాన్, చైనా ఒప్పో కలసి కట్టుగా తీసుకొస్తున్న స్మార్ట్ ఫోన్.. రేపు దీనిపై ప్రకటన

  • రెండింటి మధ్య కీలక భాగస్వామ్యం
  • కొత్త బ్రాండ్, స్టైల్ తో స్మార్ట్ ఫోన్
  • సంకేతాలిచ్చిన అమేజాన్ డాట్ ఇన్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో అమేజాన్ తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. దీనిపై రేపు ప్రకటన విడుదల కానుంది. కొత్త భాగస్వామ్యంపై అమేజాన్ డాట్ ఇన్ లో ఈ మేరకు నోటిఫికేషన్ కనిపిస్తోంది. ఇది మార్కెట్ ను షేక్ చేసే ప్రకటనగా కంపెనీ అభివర్ణిస్తోంది. తమ భాగస్వామ్యంతో స్టైలిష్ స్మార్ట్ ఫోన్, కొత్త బ్రాండ్ తో రానుందని అమేజాన్ సంకేతాలు ఇచ్చింది.

మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తైవాన్ కు చెందిన ఆసుస్ తో ఇలానే ఒప్పందం చేసుకుని ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 పేరుతో స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ల అమ్మకాలు మే నెల 3 నుంచి జరుగుతాయి. ఈ నేపథ్యంలో అమేజాన్ కూడా ఫ్లిప్ కార్ట్ మాదిరిగానే ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News