amith shah: ఢిల్లీలో కాంగ్రెస్‌ 'జనాక్రోశ్‌ ర్యాలీ'పై మండిపడ్డ అమిత్‌ షా

  • ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మరు
  • కాంగ్రెసే విభజించి పాలించింది
  • కాంగ్రెస్‌ వైఫల్యాలను చెప్పుకోడానికే ఆ సభ

కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మరని, ఆ పార్టీయే విభజించి పాలించిందని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో 'జనాక్రోశ్‌ ర్యాలీ' నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు పార్టీ నేతలు ప్రధాని మోదీ సర్కారుపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ ర్యాలీపై అమిత్‌ షా స్పందిస్తూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి ర్యాలీలు నిర్వహిస్తుండటం హాస్యాస్పదమని, కాంగ్రెస్‌ వైఫల్యాలను చెప్పుకోడానికే ఆ సభ ఉపయోగపడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారి ఆక్రోశాన్ని ఎన్నికల ఫలితాల రూపంలో కాంగ్రెస్‌ పార్టీపై చూపిస్తారని వ్యాఖ్యానించారు. 

More Telugu News