katasani: ముహూర్తం ఖరారు.. 29న వైసీపీలోకి కాటసాని

  • ఈ నెల 29న వైసీపీలో చేరిక
  • గుడివాడ-పామర్రు మధ్య జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం
  • నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకే బీజేపీకి రాజీనామా

కర్నూలు జిల్లాలో బలమైన నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారయింది. ఈ నెల 29వ తేదీన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో నాలుగైదుసార్లు సమావేశమయ్యానని... బీజేపీని వీడి వైసీపీలో చేరాలని అందరూ సూచించారని చెప్పారు.

 వారి అభీష్టం మేరకు తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, వైసీపీలో చేరుతున్నానని తెలిపారు. మొత్తం 300 వాహనాలలో ఈ నెల 29న జగన్ వద్దకు బయలుదేరుతామని చెప్పారు. గుడివాడ-పామర్రు మధ్య 29న ఉదయం 11 గంటలకు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నానని తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే టికెట్ ను తాను కోరడం లేదని... పార్టీ ఆదేశాల మేరకు పని చేసుకుంటూ వెళతానని చెప్పారు. 

More Telugu News