akhila priya: రాళ్లదాడిపై.. రేపటి సమావేశానికి హాజరవుతానని చెప్పిన అఖిలప్రియ

  • ఆళ్లగడ్డ రాళ్లదాడి ఘటనపై భేటీకి పిలిచిన చంద్రబాబు
  • హాజరైన ఏవీ సుబ్బారెడ్డి
  • హాజరుకాని అఖిలప్రియ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇటీవల టీడీపీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీ మంత్రి అఖిలప్రియ అనుచరులు ఈ ఘటనకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై  చర్చించడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డిని అమరావతికి రమ్మన్నారు.

అయితే, ఈ సమావేశానికి ఏవీ సుబ్బారెడ్డి మాత్రమే వచ్చి అఖిలప్రియ రాకపోవడంతో రేపటికి వాయిదా పడింది. ఈ సమావేశానికి సంబంధించి తనకు సమాచారం అందలేదని చెప్పిన మంత్రి అఖిలప్రియ.. రేపు జరిగే సమావేశానికి వస్తానని చెప్పారు.     

More Telugu News