kalyan ram: కల్యాణ్ రామ్ మూవీ గురించి నివేదా .. షాలినీ పాండే

  • గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ 
  • కథానాయికలుగా నివేదా .. షాలిని పాండే 
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు  

కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా ఈ రోజు ఉదయం ఒక సినిమా లాంచ్ అయింది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత వీరు మీడియాతో మాట్లాడారు.

 "చాలా రోజుల తరువాత నేను సైన్ చేసిన సినిమా ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందనీ, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నివేదా థామస్ చెప్పింది. ఇక షాలినీ పాండే మాట్లాడుతూ, " ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. కల్యాణ్ రామ్ .. నివేదాలతో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా వుంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చింది.    

More Telugu News