pruthvi: 'ఖడ్గం' సినిమా లేకపోతే .. నేను లేను: కమెడియన్ పృథ్వీ

  • ఉదయాన్నే 'ఖడ్గం' పోస్టర్ చూసుకుంటాను 
  • ఆ సినిమాయే నన్ను నిలబెట్టింది 
  • థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ పండింది  

హాస్య నటుడిగా పృథ్వీ విభిన్నమైన మేనరిజమ్స్ తో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనోభావాలను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన 'ఖడ్గం' సినిమా ప్రస్తావన తెచ్చారు.

 "నేను ప్రతి రోజు ఉదయం మా ఇంట్లోని 'ఖడ్గం' పోస్టర్ చూస్తాను. నన్ను ఈ సినిమానే నిలబెట్టింది .. ఈ సినిమా లేకపోతే .. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మేనరిజం లేదు .. నేను లేను. ఈ సినిమాలో నా పాత్రకి సంబంధించిన విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. చివరికి ఈ పాత్ర ఇలా వుంటుందనే అవుట్ పుట్ కృష్ణవంశీ నుంచే వచ్చింది. 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' అనే డైలాగ్ నేను చెబుతున్నప్పుడు యూనిట్ లోని వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. ఆ డైలాగ్ హైలైట్ అవుతుందని అప్పుడే అనుకున్నాను" అని చెప్పారు.         

More Telugu News