akshay kumar: అక్షయ్ కుమార్ సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

  • 'కేసరి' షూటింగ్ లో అగ్నిప్రమాదం
  • బాంబు పేలుడు సన్నివేశాల సమయంలో ఎగసిన మంటలు
  • మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'కేసరి' షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని పిపోడి బుద్రుక్ గ్రామంలో షూటింగ్ జరుగుతుండగా, ఈ ప్రమాదం సంభవించింది. క్లైమాక్స్ లో బాంబు పేలుడు సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా... నిప్పురవ్వలు ఎగసి సెట్ మీద పడటంతో మంటలు అలముకున్నాయి.

అయితే, ప్రమాదం జరిగిన సమయంలో అక్షయ్ కుమార్ షూటింగ్ స్పాట్ లో లేడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి, మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసు అధికారులు తెలిపారు. 21 సిక్ రెజిమెంట్ కు చెందిన కమాండర్ హవల్దార్ ఇశ్రా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1897 సెప్టెంబర్ లో జరిగిన సారాగర్హి యుద్ధంలో ఆఫ్ఘాన్ ఆక్రమణదారులతో ఇశ్రా సింగ్ ధైర్యంగా పోరాడాడు. ఆ అమరవీరుడి చరిత్రను ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. 

More Telugu News