Manohar parrikar: మీ ఆర్టికల్ చదివి ఎంతో బాధపడ్డాను: మనోహర్ పారికర్ కు పవన్ కల్యాణ్ ట్వీట్

  • తీవ్ర అనారోగ్యంతో విదేశాల్లో చికిత్స పొందుతున్న పారికర్
  • మీతో కలసి చేసిన ప్రయాణాన్ని మరువలేనన్న పవన్
  • పారికర్ వ్యాసం 'ది లాస్ట్ లెక్చర్'ను గుర్తు చేసిందన్న జనసేనాని

తీవ్ర అనారోగ్యం బారినపడి ప్రస్తుతం విదేశాల్లో చికిత్స పొందుతున్న మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు.

"ప్రియమైన మనోహర్ పారికర్ గారు...
2014 ఎన్నికల సమయంలో మీతో కలసి విమానంలో చేసిన ప్రయాణాన్ని నేను ఎన్నటికీ మరువను. మీరు ఎంతో జ్ఞానాన్ని, తెలివితేటలను కలిగున్న వ్యక్తి. మీరు ఆసుపత్రి బెడ్ పై నుంచి రాసిన ఓ వ్యాసం చదివాను. అది నన్నెంతో బాధపడేలా చేసింది. మీ మాటలు నాకు దివంగత రాండీ పౌష్ రాసిన 'ది లాస్ట్ లెక్చర్'లోని వాక్యాలను గుర్తు చేశాయి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా - జైహింద్" అని ఓ పోస్టు చేశారు.

More Telugu News