anjala zaveri: రీ ఎంట్రీ ఇస్తానంటున్న మరో సీనియర్ హీరోయిన్

  • హిట్ మూవీస్ చేసిన అంజలా జవేరి
  • రీ ఎంట్రీకి సిద్ధమంటూ సంకేతాలు 
  • మంచి పాత్రల కోసం వెయిటింగ్      

తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన నిన్నటి తరం కథానాయికలలో అంజలా జవేరి ఒకరు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ ల సరసన కథానాయికగా చేసిన ఆమె .. ఘన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్న ఆమె, సినిమాలను దూరం పెట్టారు. మళ్లీ ఇంతకాలానికి ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానని అంటున్నారు.

తెలుగులో నిన్నటి తరం కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన నదియా .. భూమిక .. సిమ్రాన్ .. ఖుష్బూ .. మీనా రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ పారితోషికాన్ని అందుకోవడంతో పాటు, మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. మరి వారిని చూసి స్ఫూర్తిని పొందిందో ఏమో తెలియదు గానీ, మంచి కథతో .. అవార్డులు తెచ్చిపెట్టే పాత్రలతో వస్తే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని అంజలా జవేరి చెప్పుకొచ్చారు.      

More Telugu News