ntr: ఎన్టీఆర్ తో మరో షెడ్యూల్ ను ప్లాన్ చేసిన త్రివిక్రమ్

  • షూటింగు దశలో త్రివిక్రమ్ మూవీ 
  • ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరణ 
  • కథానాయికగా పూజా హెగ్డే

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని రోజులుగా ఎన్టీఆర్ .. తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ను రేపటితో ముగించి .. షూటింగుకి ఒక వారం రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారట.

ఆ తరువాత షెడ్యూల్ ను మే 3వ తేదీ నుంచి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రధారులకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను ఉపయోగించుకుంటూనే, తనదైన తరహాలో ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ రూపొందిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.    

More Telugu News