Puri Jagannadh: పెద్ద దర్శకుల దృష్టిలో పడటానికి మా ఆకాశ్ చాలా ట్రై చేసేవాడు: పూరీ జగన్నాథ్

  • పూరీ దర్శకత్వంలో 'మెహబూబా'
  • హీరోగా పూరీ తనయుడు ఆకాశ్ 
  • వచ్చేనెల 11వ తేదీన రిలీజ్

పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' అనే సినిమా చేశాడు. మే 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు ఉదయం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పూరీ మాట్లాడుతూ .. "పదేళ్ల వయసు నుంచే ఆకాశ్ కథలు చెబుతూ నన్ను విసిగించేవాడు" అన్నారు.

"ఒక కథలో తాను హీరోగా అనుకుని మహేశ్ కు ఒక వేషం కేటాయించాడు. తర్వాత ఆ కథను మహేశ్ కి చెప్పమని గొడవ చేసేవాడు. అలా చేస్తే ఇద్దరినీ కలిపి మహేశ్ తన్నేస్తాడని నేను చెప్పడంతో ఆగాడు.  'ఇక ఒక వయసు వచ్చాక .. నాకు వీలైతే నిన్ను హీరోగా చేస్తాను .. ఈ లోగా నీ ప్రయత్నం నువ్ చేసుకో' అని చెప్పాను. అప్పటి నుంచి రాజమౌళి .. వినాయక్ .. సుకుమార్ దృష్టిలో పడటానికి ట్రై చేసేవాడు. వాళ్లు కనిపిస్తే చాలు .. కాళ్లకి దండాలు పెట్టేసేవాడు" అంటూ నవ్వేశాడు.  

More Telugu News