Mahesh Babu: 3 రోజుల్లో 'భరత్ అనే నేను'కి 120 కోట్లు .. 200 కోట్ల దిశగా పరుగులు

  • 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ 
  • 3 రోజుల్లో 120 కోట్ల గ్రాస్ 
  • 200 కోట్ల మార్క్ దిశగా పరుగులు  

ఆమధ్య వరుసగా రెండు పరాజయాలతో అభిమానులను నిరాశ పరిచిన మహేశ్ బాబు, తాజాగా 'భరత్ అనే నేను'తో భారీ హిట్ ను అందించాడు. దాంతో అభిమానులు సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నారు. తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 'రంగస్థలం' సినిమా మూడున్నర రోజుల్లో సాధించిన వసూళ్లను 'భరత్ అనే నేను' రెండు రోజుల్లోనే వసూలు చేయడం విశేషం.

ఇక మూడు రోజుల్లో ఈ సినిమా 120 కోట్ల గ్రాస్ ను .. 75 కోట్ల షేర్ ను సాధించింది. 'బాహుబలి' విషయం అటుంచితే ఇంతవరకూ ఏ తెలుగు సినిమా కూడా 200 కోట్ల మార్క్ ను చేరుకోలేదు. 'రంగస్థలం' ఇంతవరకూ 185 కోట్లకి పైగా రాబట్టింది. 'భరత్ అనే నేను' సినిమా దూకుడు ఒక రేంజ్ లో వుంది కనుక, ఈ సినిమా 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      

More Telugu News