kalyan ram: నివేదా థామస్ .. షాలినీ పాండేతో సెట్స్ పైకి కల్యాణ్ రామ్

  • కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా 'నా నువ్వే'
  • తదుపరి చిత్రానికి సన్నాహాలు 
  • కథానాయికలుగా నివేదా .. షాలిని పాండే        

ప్రస్తుతం కల్యాణ్ రామ్ .. 'నా నువ్వే' సినిమా చేస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది. జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, వచ్చేనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన మరో ప్రాజెక్టును మొదలుపెట్టడానికి కల్యాణ్ రామ్ సన్నాహాలు చేస్తున్నాడు.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ 'గుహన్' ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తారు. తెలుగులో నివేదా థామస్ వరుస విజయాలతో ఉండగా, 'అర్జున్ రెడ్డి' తో విపరీతమైన క్రేజ్ ను షాలిని పాండే సొంతం చేసుకుంది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

More Telugu News