mumbai: సన్యాసిగా మారిన కోటీశ్వరుడైన వజ్రాల వ్యాపారి!

  • మోతీలాల్ దహ్యాభాయి జవేరీ అండ్ సన్స్ పార్ట్‌ నర్ అయిన యాత్రిక్ జవేరీ
  • టీనేజ్ లో వజ్రాల వ్యాపారంలో అడుగుపెట్టిన యాత్రిక్ బాబా
  • ముంబైలో దీక్ష స్వీకరణ

కోటీశ్వరుడైన వజ్రాల వ్యాపారి సన్యాసిగా మారిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మోతీలాల్ దహ్యాభాయి జవేరీ అండ్ సన్స్ పార్ట్‌ నర్ అయిన యాత్రిక్ జవేరీ (59) ముంబైలోని వాకేశ్వర్ ప్రాంతంలో సన్యాసం దీక్ష తీసుకున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన యాత్రిక్ జవేరీ టీనేజ్ లో వజ్రాల వ్యాపారంలో అడుగుపెట్టారు. ముంబైలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

తన గురువు లబ్దీ చంద్రసాగర్ బోధనలతో ప్రభావితుడైన యాత్రిక్ జవేరీ ఇప్పుడు సన్యాసం దీక్ష తీసుకున్నారు. ఈ సందర్భంగా వజ్రాల వ్యాపారం ద్వారా సంపాదించిన ధనాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగించానని, ఇకపై సంపాదించే జ్ఞానం ద్వారా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నానని అన్నారు. ఆయన దీక్షోత్సవానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వారంతా ఆయన సన్యాసం స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

More Telugu News